కాల్వగేట్ల ఎత్తివేత..50 ఎకరాల్లో పంట నష్టం


ప్రకాశం: జిల్లాలోని సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో కొంతమంది దుండగులు మేజర్ కాల్వ గేట్లు ఎత్తివేయడంతో భారీ పంట నష్టం వాటిల్లింది. కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడటంతో సమీపంలోని 50 ఎకరాల్లోని వరికుప్పలు నీటమునిగాయి. ఈ సంఘటనతో తీవ్రంగా నష్టపోయామని సంబంధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను  ఆదుకోవాలని వారు  ప్రభుత్వాన్ని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top