'కరకట్టను కేంద్రమంత్రులే ఆక్రమించారు'


విజయవాడ: కృష్ణానది కరకట్టను ఎంపీలు, కేంద్రమంత్రులే ఆక్రమించారని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీ వీ రాఘవులు ఆరోపించారు. కరకట్ట అక్రమణలపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన బుధవారం విజయవాడంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు.


ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్రాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే సహించేది లేదని  బీవీ రాఘవులు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా హెచ్చరించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top