'వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు'

'వంద రోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు' - Sakshi


కడప: రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ఆదివారం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించిన సెమినార్లో రాఘవులు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు వందరోజుల పాలనపై ఆయన పెదవి విరిచారు. బాబు వందరోజుల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top