జనంపైకి దూసుకెళ్లిన బస్సు..


రాజమండ్రి: రాజమండ్రి నగరం మోరంపూడి జంక్షన్ వద్ద ఓ బస్సు జనంలోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం జరిగింది.



మోరంపూడి జంక్షన్లో కారును ఢీకొట్టి.. జనాలపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అది ఓ ప్రైవేట్  కాలేజీ బస్సుగా గుర్తించారు. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ బస్సు కారు, బైక్లను ఢీకొట్టింది. ఇంకా ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top