బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి : తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న వినీత లేడీస్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఎస్వీ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.