బీటెక్‌ విద్యార్థిని గొంతుకోశారు

బీటెక్‌ విద్యార్థిని గొంతుకోశారు - Sakshi

ప్రొద్దుటూరులో యువతి దారుణ హత్య

 


ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. పట్ట పగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న కడపన హైందవి (22) అనే యువతిని శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. హత్యానంతరం ఆమె వంటిపై బంగారు ఆభరణాలు కన్పించకపోవడంతో వాటి కోసమే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన జయప్రకాశ్‌రెడ్డి, విజయలక్ష్మిల దంపతులకు  కుమార్తె హైందవి. పట్టణంలోని షిర్డీ సాయి, గౌరి శంకర్‌ జూనియర్‌ కళాశాలల్లో జయ ప్రకాశ్‌రెడ్డి అధ్యాపకునిగా పనిచేస్తుండగా, విజయలక్ష్మి దువ్వూరు మండలంలోని నీలాపురంలో ప్రభుత్వ టీచరుగా పనిచేస్తున్నారు.



హైందవి ఇటీవల హైదరాబా ద్‌లోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ‘ట్రిపుల్‌ ఈ’ కోర్సు పూర్తి చేసింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఉంటున్న హైందవి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తుండ టంతో పగలంతా ఇంటో ఒంటరిగానే ఉంటోంది. వారిల్లు పట్టణ శివారులో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రితో రిపేరుకు ఇచ్చిన స్కూటీని తీసుకురావాల్సి ఉందని హైందవి చెప్పింది. దీంతో తన బైక్‌పై తీసుకెళ్లిన జయప్రకాశ్‌రెడ్డి ఆమెను స్కూటీ షెడ్‌ వద్ద వదలి కళాశాలకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హైందవి స్కూటీతో ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వచ్చిన తండ్రి  రెండు మూడుసార్లు పిలిచినా సమాధానం రాలేదు.



పక్కనే మరో ద్వారం వద్దకు వెళ్లగా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంట్లోకి వెళ్లిన ఆయనకు బాత్‌ రూమ్‌లో హైందవి రక్తపు మడుగులో కన్పిం చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీలు భక్తవత్సలం, నాగేశ్వరరెడి బృందం వచ్చి సంఘటన స్థలాన్ని సందర్శించారు. హైందవి వంటిపై ఉండాల్సిన ఆభరణాలు మాయమై ఉండటాన్ని గమనించారు. దుండగులు స్కూటీని కూడా తీసుకెళ్లారు. దర్యాప్తు  సాగుతోంది.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top