బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి స్థలం కేటాయించాలి


కొరిటెపాడు : బీఎస్‌ఎన్‌ఎల్ ఎ.పి సర్కిల్ నూతన కార్యాలయం ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం మంజూరు చేయడానికి కృషి చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్.రావు విజ్ఞప్తి చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోసం కృషి చేయాలని కోరుతూ స్థానిక లక్ష్మీపురంలోని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు కార్యాలయంలో ఎం.ఎల్.ఎన్.రావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక రాష్ట్రం అయిన నేపథ్యంలో రాష్ట్రంలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి కార్యాలయం ఏర్పాటుకు అర ఎకరం నుంచి ఎకరం వరకు స్థలం అవసరం వుందని స్థలం మంజూరుకు ప్రభుత్వంతో మాట్లాడి కేటాయించేలా చూడాలని కోరారు.



స్పందించినఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ సీఆర్‌డీఎ మాస్టర్ ప్లాన్ వచ్చిన అనంతరం ప్రభుత్వ కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి  బీఎస్‌ఎన్‌ఎల్ ఎ.పి సర్కిల్ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ రాయపాటిని కలసిన వారిలో బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎం ఎ.ప్రభాకర్ తదితరులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top