దారుణ హత్య..బావిలో శవం
చిత్తూరు క్రైం: వ్యక్తిని చంపి బావిలో పడేసిన సంఘటన చిత్తూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు... ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా చంపి సంతపేట నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్నబావిలో పడేశారు. ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమందించారు. మృతున్ని మాతాషికి చెందిన విజయ్గా అనుమానిస్తున్నారు. అతడు రెండు రోజుల నుంచి కనపడటంలేదని తల్లిదండ్రులు గతవారమే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మృతదేహాన్ని వెలికి తీయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.