పట్టపగలు వృద్ధుడి దారుణ హత్య
గుంటూరు (తాడికొండ) : గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావిచెట్టు సెంటర్ వద్ద శనివారం దారుణం చోటుచేసుకుంది. కుంభా కోటేశ్(80) అనే వృద్ధుడు పాశవికంగా పట్టపగలే హత్యకు గురయ్యాడు. ఆస్తి కోసం సొంత మనవరాలి(కూతురి కూతురు) భర్త శ్రీనివాస్.. కోటేశ్ను దారుణంగా నరికి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.