పదిలక్షలతో పెళ్లికొడుకు జంప్!
నూజివీడు: ఏడడుగులేసి మూడు రోజుల కాకముందే పెళ్లి కొడుకు పరారైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గత మూడు రోజుల క్రితమే పెళ్ల ఓ జంటకు పెళ్లైంది.
అయితే పది లక్షల కట్నంతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. పెళ్లి కూతురు కుటుంబం ఫిర్యాదు చేశారు అని పోలీసు తెలిపారు.
పెళ్లి కూతురు తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెళ్లికొడుకు గురించి గాలింపు చేపట్టారు.