రవీంద్రనాథ్రెడ్డికి పడిపోయిన బీపీ, షుగర్
కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగోరోజు కూడా కొనసాగుతోంది. తాగు, సాగు నీటి సమస్యలు తీర్చాలని కోరుతూ ఆయన వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు.
బుధవారం నాడు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రవీంద్రనాథ్ రెడ్డికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్య బృందం తెలిపింది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వారు సూచించారు.