ఇంటిపై నుంచి పడి బాలుడి మృతి


పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో ఇంటిపై నుంచి పడి మణికంఠ అనే ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. శనివారం సాయంత్రం ఇంటి రెండో అంతస్తులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాలుడి తల్లి శశికళ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. బాలుడి మృతితో తల్లి శోకంలో మునిగిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top