ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి
కంచికచర్ల (విజయవాడ) : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న బాలుడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా పరిటాలలోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వేముల వీరాంజనేయులు(16)బస్టాండ్ సమీపంలో సైకిల్ పై రోడ్డు దాటుతున్న సమయంలో.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.