ఆధార్ తో లింక్ పెట్టడం సరికాదు: బొత్స
హైదరాబాద్: రేషన్కార్డుల జారీకి ఆధార్ తో లింక్ పెట్టడం సరికాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ ఉండకూడదన్నారని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ చేస్తున్నారని, ఇది చంద్రబాబు మాట మార్చే వైఖరికి నిదర్శనమని బొత్స సత్యనారాయణ విమర్శించారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అంతకుముందు దుయ్యబట్టారు.