మునిగిన పడవ: తప్పిన ప్రమాదం


కాకినాడ: చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న బోటు తూర్పు గోదావరి జిల్లా సాగర సంగమం అంతర్వేది సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కాకినాడకు చెందిన మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది.



అయితే ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న మరో బోటులో ఉన్న మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి మునిగిపోతున్న బోటులో ఉన్న ఏడుగురిని కాపాడారు. కాగా, ఈ ఘటనలో రూ. 20లక్షల విలువ చేసే బోటుతోపాటు, రూ.లక్ష విలువ చేసే చేపలు కూడా మునిగిపోయాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top