పేకాట రాయుళ్ల అరెస్టు
కర్నూలు: ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కర్నూలు జిల్లా బేతంచర్ల మండల కేంద్రంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సుబ్రమణ్యం ఆదివారం తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పేకట శిబిరం పై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్రమణ్యం తెలిపారు.
(బేతంచర్ల)
సంబంధిత వార్తలు