రెండు బైకులు ఢీ..ఒకరు మృతి
చోడవరం(విశాఖపట్నం): చోడవరం సమీపంలోని బొడ్డేరు వంతెన వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బేరా రాజు(20) అనే యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో హుటాహుటిన దగ్గరలోని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు బైకులు నుజ్జునుజ్జయ్యాయి.
సంబంధిత వార్తలు