'కులాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు'
తిరుపతి :
కాపులను నమ్మించి సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. పథకం ప్రకారమే కాపులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్షకు వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుందని భూమన తెలిపారు.