ప్రజల నమ్మకాన్ని నిలబెడతా: అఖిల ప్రియ


ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో భూమా అఖిల ప్రియ ఆనందం వ్యక్తం చేశారు.  ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన వారికి ఆమె శుక్రవారం కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజక వర్గ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  కుటుంబ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అఖిల ప్రియ తెలిపారు. 


 


తల్లి ఆశయ సాధనకు పాటుపడతానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేయనందువల్లే తన ఎన్నిక ఏకగ్రీవమైందని అఖిల ప్రియ అన్నారు.  ఆళ్లగడ్డ ఉప ఎన్నిక బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top