బంద్ని విజయవంతం చేయాలి
జయప్రదం చేయండి: వైవీ సుబ్బారెడ్డి, బాలినేని పిలుపు
ఒంగోలు అర్బన్ : ప్రత్యేక హోదా కోసం శనివారం చేపట్టనున్న జిల్లా బంద్ను జయప్రదం చేయాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమై బంద్ ఏర్పాట్లపై చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపునకు అనూహ్య స్పందన వస్తోందని అన్నారు.
ఈ బంద్కు సిపిఐ, సిపిఎంతో పాటు ఎంఆర్పీఎస్, ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు ఆంధ్ర ప్రజలను వంచించాయని మండిపడ్డారు. ఈ బంద్లో కార్మిక సంఘాలు, వ్యాపారులు, ఉద్యోగులతోపాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు. పోరాటాలతో ప్రత్యేక హాదా సాధిద్దాం... ఇందుకోసం ఎవరూ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్రాజు, కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్బాబు పాల్గొని చర్చించారు.
వీరితోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ, ఇతర నాయకులు శింగరాజు వెంకట్రావు, వై వెంకటేశ్వరరావు, బడుగు ఇందిర, ధూళిపూడి ప్రసాద్, కేవీ ప్రసాద్, తోటపల్లి సోమశేఖర్, లంకబోతు అంజిరెడ్డి, నత్తల భీమేష్, సమావేశంలో పాల్గొన్నారు.