మహానందిలో నేలకొరిగిన అరటిపంట
కర్నూలు : కర్నూలు జిల్లాలోని మహానందిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పెద్ద మొత్తంలో అరటిపంట నేలకొరిగింది. అలాగే ఈదురు గాలులకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ వర్షం కారణంగా మండలంలో దాదాపు రూ.50లక్షల ఆస్తినష్టం జరిగిఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.