మిస్టర్ ఆంధ్రాగా బాలకృష్ణ

మిస్టర్ ఆంధ్రాగా బాలకృష్ణ - Sakshi


రాజమండ్రిసిటీ : అడ్డూరి నారాయణరావు మెమోరియల్ 3వ రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆంధ్రాగా కృష్ణాజిల్లాకు చెందిన కె. బాలకృష్ణ ఎంపికయ్యారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని గౌతమీ వ్యాయామ కళాశాలలో ఆదివారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 140 మంది బాడీబిల్డర్లు పాల్గొన్నారు. 55, 60, 65, 70, 75, 80, 85, 85 ప్లస్ కేజీల  విభాగాలలో పోటీలు నిర్వహించినట్టు రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరమణమూర్తి తెలిపారు.



ఈ 8 కేటగిరీల్లో ఒక్కొక్క స్థాయికి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు విజేతలను ఎంపికచేశామన్నారు. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన కేశవభట్ల ఛారిబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవభట్ల శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. మిస్టర్ ఆంధ్రాగా ఎంపికైన బాలకృష్ణకు బహుమతులతోపాటు ప్రత్యేక బహుమతిగా రిఫ్రిజిరేటర్‌ను అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top