డ్రైనేజిలో దొరికిన శిశువు మృతి
పుట్లూరు: డ్రైనేజిలో స్థానికులకు దొరికిన పసికందు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని కస్తూరిభా పాఠశాలకు సమీపంలోని మురుగు కాల్వలో శుక్రవారం ఉదయం స్థానికులకు పసికందు ఏడుపు వినిపించింది.
దీంతో వారు ఆ శిశువును తీసుకెళ్లి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారిని చేర్పించారు. ఆరోగ్యం విషమించి శిశువు శనివారం ఉదయం చనిపోయింది. కాగా, శిశువును మురుగు కాల్వలో వదిలి వేసిన వారు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.