బి గ్రేడ్ ఎర్రచందనం టన్ను రూ.50 లక్షలు


సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ గిడ్డంగుల్లో ఉన్న ఎర్రచందనం ఈ-వేలంలో బుధవారం కూడా బిడ్డర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. సోమవారం వీటి వేలం మొదలైంది. మంగళవారం వేలం నిర్వహించలేదు. తిరిగి బుధవారం నిర్వహించారు. అయితే తొలిరోజుతో పోల్చితే బుధవారం రేటు గణనీయంగా తగ్గిపోయింది. బి గ్రేడ్ టన్ను సగటు ధర సోమవారం 1.35 కోట్లు కోట్ కాగా బుధవారం రూ.50 లక్షలకు తగ్గింది. బుధవారం మొత్తం 746.882 టన్నులను 30 లాట్లుగా వేలం వేశారు. 27.95 టన్నుల ‘బి’ గ్రేడ్ ఎర్రచందనానికి సగటున టన్నుకు రూ.50 లక్షలు ధర పలికింది. 718.92 టన్నుల సి గ్రేడ్‌కు సగటున టన్ను రూ. 25.88 లక్షలు పలికింది. సి గ్రేడ్ టన్నుకు గరిష్ట ధర రూ. 37.24 లక్షలు, కనిష్ట ధర రూ. 16 లక్షలు కోట్ అయ్యింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top