ఆటో బోల్తా : 8 మందికి గాయాలు


కారంచేడు: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఓ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి.  ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడు సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ఆటో మండలంలోని స్వర్ణ గ్రామం నుంచి కూలీలను తీసుకెళ్తుతోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top