ఆటో ఢీకొని వ్యక్తి మృతి
రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ఆటో బలితీసుకుంది. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లి మర్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అప్పలాచారి (54) పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన ఆటో అతడిని ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.