ఘర్షణ నివారించబోతే హత్య చేశారు!


విశాఖపట్నం: పుణ్యానికిపోతే పాపం ఎదురైనట్లు, మంచికి పోతే చెడు ఎదురైనట్లు రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించబోయి ఓ ఆటో డ్రైవర్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ కిరాతకులు సర్ధిచెప్పడానికి వచ్చిన వ్యక్తినే హత్య చేశారు.  పాయకరావుపేట మండలం రామభద్రపురంలో ఈ దారుణం జరిగింది.



స్థానికుల కథనం ప్రకారం రామభద్రపురంలో రెండు వర్గాలకు చెందిన వారు ఘర్షణపడుతున్నారు. ఆ ఘర్షణ నివారించేందుకు ఆటోడ్రైవర్ సత్తిబాబు ప్రయత్నించాడు. వారికి సర్ధిచెప్పబోయాడు. వారు అతనిని కత్తులతో పొడిచి హత్య చేశారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top