ఏఆర్ కానిస్టేబుల్పై కత్తితో దాడి
మంచాల (చేబ్రోలు) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏఆర్ కానిస్టేబుల్పై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి సంఘటన సోమవారం సంచలనం కలిగించింది. మంచాల గ్రామంలోని బస్టాండ్ వద్ద జరిగిన హత్యాయత్నంలో బాపట్ల మండలం పూండ్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కూరపాటి శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు చుండూరు మండలంలో పని చేసే సమయంలో కొత్తపల్లి నారికేళపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఆనందరావు భార్యతో సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగించాడు. భర్త హెచ్చరికల నేపథ్యంలో కొంతకాలం ఆమె కానిస్టేబుల్కు దూరంగా ఉంది.
అయినాగానీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఆమెను వేధింపులకు గురిజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల కిందట ఆటో డ్రైవర్ భార్యను కానిస్టేబుల్ శ్రీనివాసరావు తీసుకెళ్లాడు. దీంతో ఆనందరావు శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు. పూండ్ల నుంచి ద్విచక్ర వాహనంపై కానిస్టేబుల్, ఆయన కుమారుడు కలిసి సోమవారం గుంటూరు బయలు దేరారు. మంచాల గ్రామం వద్ద ఆటో డ్రైవర్ ఆనందరావు కాపు కాసి కత్తితో దాడి చేశాడు. తల, మెడ, చేతులపై నాలుగు చోట్ల గాయాలయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.