ఏయూకు అరుదైన గౌరవం
ఇండియాటుడే-నీల్సన్ సర్వేలో అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాటుడే-నీల్సన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో దేశంలోని అగ్రశ్రేణి వర్సిటీల్లో ఏయూకు అత్యుత్తమ స్థానం దక్కింది. దేశంలోని స్టేట్ యూనివర్సిటీల్లో రెండో స్థానం, అన్ని యూనివర్సిటీల్లో 8వ స్థానం దక్కింది. రాష్ట్ర విభజనానంతరం ఉన్నత విద్యారంగంలో ఇదో కీలకమైన ముందడుగు అని ముఖ్యమంత్రి సమాచార సలహాదారు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.