ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
కాకినాడ : కాకినాడ మెయిన్రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఆదివారం తెల్లవారుజామున వాచ్మెన్ కాళ్లు, చేతులు కట్టేసి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. అయితే ఏటీఎం తెరుచుకోకపోవటంతో దుండగులు ఖాళీ చేతులతో వెనుదిరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.