నగల దుకాణం యజమానిపై దాడి


తమ సోదరుల మధ్య ఆస్తి తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నాడనే అక్కసుతో నగల దుకాణం యజమానిపై కొందరు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. త్రికర జ్యుయెలరీ దుకాణం యజమాని ఆకుల బాలాజీపై స్థానిక రైస్‌మిల్ యజమాని వేమూరి వెంకటేశ్వరరావు మరో ముగ్గురితో కలసి వచ్చి దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడికి కూడా వచ్చిన వెంకటేశ్వరరావు.. చంపుతామని బాలాజీని బెదిరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top