రోడ్డుప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి


కర్నూలు (నంద్యాల) : నంద్యాల పట్టణంలోని పార్కు రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రుడు(40) అనే ఆర్మీ ఉద్యోగి మృతిచెందాడు. బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఎదురెదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top