శివాజీ రౌండ్టేబుల్ సమావేశం రసాభాస
విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్తో నటుడు, బీజేపీ నేత విశాఖలో ఈరోజు నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశం రసాభాస అయింది. అధికార పార్టీ నేతల పేర్లు ప్రస్తావనకు రాగానే శివాజీ, నిర్వాహకులు మైకు లాక్కోవడంపై మేథావులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు మండిపడ్డారు. అధికార పార్టీ నేతల గురించి మాట్లాడేందుకు అవకాశం ఎందుకు ఇవ్వరని వారు నిలదీశారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శివాజీ సమావేశం నుంచి వెళ్లిపోయారు.శివాజీ వైఖరిని విద్యార్థి సంఘ నేతలు ఖండించారు. ఉత్తరాంధ్రలో మళ్లీ సమావేశం నిర్వహిస్తే దాడులు చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు