వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి: పార్లమెంటరీ పరిశీలకులను, అనుబంధ సంఘాలు, పార్టీ బాధ్యులను వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రకటించింది. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకునిగా చినవెంకటరెడ్డి, బాపట్లకు ఆళ్ల రామకృష్ణారెడ్డి, నెల్లూరు పార్లమెంట్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ప్రకాశం జిల్లా పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.