'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు'

'చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారు' - Sakshi


అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాలనపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు కసాయిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు, వలసలు రోజురోజుకు పెరిగిపోయాయని.. లక్షల సంఖ్యలో పశువులు కబేళాకు వెళ్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రఘువీరా విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top