ఏపీ రాజధాని పేరు అమరావతిగా ఖరారు
ఏపీ పారిశ్రామిక విధానానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజధానికి అమరావతి పేరును ఖరారు చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం వరకు కొనసాగింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి..
-
ఇండస్ట్రియల్ పాలసీకి ఆమోదం -
ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు -
10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ -
వ్యవసాయం, బయోటెక్ రంగాలకు ప్రోత్సాహకాలు -
99 ఏళ్ల పాటు భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయం -
100 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే ప్రత్యేక రాయితీలు -
స్వచ్ఛ్, గ్రీన్ ఏపీలకు సహకరిస్తే ఐదేళ్ల పాటు వ్యాట్, జీఎస్పీ రీయింబర్స్ చేయాలని నిర్ణయం -
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు