'హైదరాబాద్ నుంచి పాలన బాధగా ఉంది'
అనంతపురం: రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి పాలన చేయడం బాధగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వీలైనంత తర్వగా ఏపీలో రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పారు. అక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని అన్నారు. త్వరలో అనంతపురంలో ఎయిమ్స్ అనుబంధ సంస్థ నిట్ ఏర్పాటు చేస్తానని హామీయిచ్చారు.
రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకే రుణమాఫీని అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకుని అన్ని హామీలనూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.