బీజేపీ సర్కార్పై ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ సర్కార్పై ప్రత్తిపాటి సంచలన వ్యాఖ్యలు - Sakshi


గుంటూరు : బీజేపీ ప్రభుత్వంపై  ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలకు బీజేపీ సర్కార్ అంటేనే బాధ కలుగుతోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్కు రూ.1600 కోట్లు అడిగితే కేవలం రూ.100కోట్లు ఇవ్వడం దారుణమన్నారు.



ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి కేంద్రం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.  చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం ఏపీకి అన్యాయం చేసిదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు...ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఈరోజు ఉదయం అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top