బదిలీ మార్గదర్శకాలు మార్పు?
హైదరాబాద్: ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్డీవో స్థాయి కంటే కింది అధికారులు సొంత జిల్లాల్లోనే కొనసాగేలా మార్పులు చేసే అవకాశముంది.
ఎన్జీవోల పాటు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. పలు ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల్లో మార్పులకు సిద్ధమవుతోంది.