వైఎస్ జగన్ భరోసా యాత్రతో దిగొచ్చిన సర్కార్
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రకు ఫలితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 33 మంది రైతు కుటుంబాలకు మధ్యంతర పరిహారం కింద రూ.49 లక్షల 50 వేలు విడుదల చేసింది. రైతు ఆత్మహత్యలు లేవని, వైఎస్ జగన్ భరోసా యాత్రపై గతంలో ఏపీ మంత్రులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఉత్తర్వులతో అనంతపురం జిల్లాలో 33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ధ్రువీకరించింది.