పట్టిసీమ ప్రాజెక్టుపై జీవో విడుదల చేసిన ప్రభుత్వం


హైదరాబాద్:పట్టిసీమ ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. 14 మీటర్ల కంటే ఎక్కువ స్థాయిలో నది ప్రవహిస్తున్నప్పుడే పట్టిసీమ నుంచి నీటిని తరలించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. రబీ సీజన్ లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయకూడదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.


 


కాటన్ బ్యారేజ్ లో నీటి నిల్వ 14 మీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు నీటిని తరలించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ షరతులన్నీ పాటించాకే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top