ఏపీ ప్రభుత్వం కొత్త మెలిక!
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ(పే రివిజన్ కమిషన్) చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. మాస్టర్ స్కేల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఆర్థిక శాఖ అధికారులు మాస్టర్ స్కేల్ మార్పులపై ఉదయం నుంచి కసరత్తు మొదలుపెట్టారు. ఈ కారణంగా పీఆర్సీ జీఓ విడుదల మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.