వీజీటీఎం పరిధిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చెక్


విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి- మంగళగిరి(వీజీటీఎం) పరిధిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చెక్ పడింది. వీజీటీఎం పరిధిలోని అన్ని పంచాయతీల్లో పరిపాలన అధికారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ రాజధాని నిర్మాణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వీజీటీఎం పరిధిలోని భూముల క్రయ విక్రయాలకు ఇక గ్రామ పంచాయతీలకు అనుమతి ఇచ్చే అధికారం ఉండదు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top