పానకాల స్వామిని దర్శించుకున్న ఏపీ సీఎస్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువై ఉన్న నరసింహ స్వామిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలతో ఆశ్వీరచనాలు అందజేశారు.