4, 5 తేదీల్లో జిల్లాలో సీఎం పర్యటన?

4, 5 తేదీల్లో  జిల్లాలో సీఎం పర్యటన? - Sakshi


 మంచినీళ్లపేట(పూండి): వచ్చే నెల 4, 5 తేదీల్లో జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించే అవకాశాలు ఉండడంతో అధికారులు అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో సీఎం పర్యటించే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన రూట్ మ్యాప్‌ను కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్, సీఐ వై.రామకృష్ణ , వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ కె. రవికిశోర్ సోమవారం పరిశీలించారు. సీఎం పర్యటన మండలం ఉండవచ్చునని వజ్రపుకొత్తూరు ఎంపీపీ జి. వసంతరావు కూడా తెలిపారు.

 

 ప్రధానంగా మత్స్యకార ప్రాంతంలో సభ నిర్వహించాలని పలాస ఎమ్మెల్యే జీఎస్‌ఎస్ శివాజీ చెప్పడంతో సోమవారం మంచినీళ్లపేట, గుణుపల్లి గ్రామాలను పోలీసు అధికారులు పరిశీలించారు. గుణుపల్లిలో సీఎం కాన్వాయ్‌కి సరిపడ స్థలం కొరతగా ఉండడంతో మంచినీళ్లపేట ప్రాంతాన్ని పరిశీలించారు. హెలీప్యాడ్, కాన్వాయ్ ఇతర వాహనాలకు సరిపడా స్థలం పరిశీలించిన మీదట పర్యటన ఖరారైయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు.  మత్స్యకార గ్రామమైన కొత్తపేటలో కాన్వాయ్‌కు సరిపడా స్థలం ఉన్నప్పటికీ అక్కడ ట్రైమెక్స్ ఉద్యమకారులు నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో స్థల పరిశీలన చేయలేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top