రాజధానిపై విస్తృత చర్చ జరగాలి: రఘువీరా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై విస్తృత చర్చ జరగాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సూచించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల,నేతలతో చర్చించిన తర్వాతనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మీడియాకు వెల్లడించారు.
లేకపోతే అనేక సమస్యలకు దారి తీస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకునే ముందు అఖిలపక్ష భేటి నిర్వహించాలని రఘువీరా సూచించారు. హైదరాబాద్ లాగే అన్ని కార్యాలయాలను ఓకే చోట కేంద్రికృతమైతే సమస్యలు వస్తాయని.. కొన్ని ప్రాంతాలు కూడా అభివృద్దికి నోచుకోవని రఘువీరా అన్నారు.
తెలుగుదేశం పార్టీ విధానాలను, వైఫల్యాలను, రుణమాఫీ, ఎన్నికల హామీల విస్మరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలకు, రైతులకు నందిగామ ఉప ఎన్నిక ఓ చక్కటి అవకాశమని ఆయన తెలిపారు.