రేపు ఏపీ కేబినెట్ సమావేశం


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి రేపు (బుధవారం) ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో సింగపూర్ బృందం సమర్పించిన రాజధాని మాస్టర్ ప్లాన్, తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై ప్రధానంగా చర్చిస్తారు.  రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు మనసు మార్చుకొని, తాము ఇచ్చిన అంగీకార పత్రాలు తిరిగి ఇచ్చివేయమని  ఆందోళనకు దిగిన నేపధ్యంలో, ఆ అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది.



మంత్రి మండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top