10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. నూతన పారిశ్రామిక విధానం, చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై ఈ సమావేశంలో కేబినెట్ చర్చించనుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం విధించి రోడ్ ట్యాక్స్పై అనుసరించాల్సిన విధానంపై కూడా కేబినెట్లో చర్చకు రానుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరు పెట్టడం, కొత్త ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చిస్తారు. కేబినెట్ సమావేశం అనంతరం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.