రాజధాని అంశంపై కేబినెట్ చర్చ
హైదరాబాద్: రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక అంశం ఎజెండాలో లేకపోయినప్పటికీ ఏపి మంత్రి మండలి ఈరోజు చర్చించనుంది. మంత్రి మండలి కొద్దిసేపట్లో సమావేశం కానుంది. రాజధాని ఎక్కడ అన్నదానిపై చర్చిస్తారు. ఇంకా జాతీయ స్థాయి విద్యాసంస్థలకు స్థలం కేటాయింపులు, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసందానం చేసే అంశంపైన కూడా చర్చిస్తారు.
ఏపి ప్రభుత్వం అక్టోబరు 2 నుంచి ఎన్టీఆర్ పేరుతో పలు పథకాలు ప్రారంభించనుంది. ఆ పథకాలపై కూడా కేబినెట్లో చర్చిస్తారు.