రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం గం.9.30 ని.లకు ఆరంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి.
అంతకుముందు ఉదయం గం.7.30 ని.లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బీఏసీ సమావేశానికి హాజరవుతారు. తరువాత అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం గం.3ని.లకు టీడీఎల్పీ సమావేశం జరుగనుంది.
సంబంధిత వార్తలు